Nandamuri Balakrishna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం తెలంగాణ సచివాలయం చేరుకున్న బాలకృష్ణ రేవంత్కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ హీరో అక్కినేని నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నాయి.