Balayya | ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య యూసుఫ్ గూడలోని తన స్వగృహంలో శనివారం తెల్లవారుజామున కన్నుమూసాడు. 1958లో వచ్చిన ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన బాలయ్య ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించాడు. ఈయన మృతి పట్ల సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈయన మరణ వార్త విన్న బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాడు.
‘సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు, నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’, ‘మిత్రుడు’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలలో బాలయ్య నటించాడు.
Actor, MLA #NandamuriBalakrishna expressed his deepest condolences on the sudden demise of Veteran actor Shri #Balayya garu. pic.twitter.com/k8mJnRkAgy
— Vamsi Kaka (@vamsikaka) April 9, 2022