సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఇంట ఏ వేడుక జరిగినా కూడా అందుకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటుంది. తాజాగా ఇంట్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల నుండి నిమజ్జనం వరకు వీడియోగా రూపొందించి అభిమానులతో పంచుకున్నారు.
మట్టి గణేషుడిని ఇంట్లోని బకెట్లో నిమజ్జనం చేయగా, ఆ కార్యక్రమంలో మహేష్, నమ్రత, సితార, గౌతమ్ పాల్గొన్నారు. నిమజ్జనం చేసే ముందు పూజలు చేసి ఆ తర్వాత గణేషుడికి బైబై చెప్పారు. గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ నమ్రత తను షేర్ చేసిన వీడియోకి కామెంట్ పెట్టింది.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే చివరిగా సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకులని అలరించాడు.ఇక ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే అవకతవకల నేపథ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.