అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీపై ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. మా అందరి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం జగన్తో చిరంజీవి సమావేశమవుతున్నారని పేర్కొన్నారు. సినిమా విడుదల ఉండడం వల్ల నేను వెళ్లలేక పోయానని వెల్లడించారు.
జగన్తో లంచ్మీట్లో పాల్గొనేందుకు చిరంజీవి తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకు న్నారు. దాదాపు వీరి మధ్య గంటకు పైగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో పాటు థియేటర్లు, సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు అవకాశాలు ఉన్నాయి.