“ది ఘోస్ట్’ సినిమాలో యాక్షన్ హైలైట్గా ఉంటుంది. ప్రవీణ్ సత్తారు గత సినిమాల్ని చూశాను. యాక్షన్ బాగా డీల్ చేస్తారనిపించింది. ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదు..ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది’ అని అన్నారు అగ్ర హీరో అక్కినేని నాగార్జున. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శనివారం కిల్లింగ్ మెషీన్ పేరుతో ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ప్రత్యేకంగా ట్రెయినింగ్ తీసుకున్నా. టెర్రిఫిక్ యాక్షన్తో థ్రిల్ను పంచే చిత్రమిది. ఈ తరహా యాక్షన్ గతంలో ఎప్పుడూ చేయలేదు. ది ఘోస్ట్ అంటే దెయ్యం కాదు. సినిమాలో ఇంటర్పోల్ ఏజెంట్ విక్రమ్కు కోడ్నేమ్ ఇది’ అని అన్నారు. ‘నాగార్జునగారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు స్వతహాగా యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాలో నాగార్జున ైస్టెలిష్గా కనిపిస్తారు’ అని దర్శకుడు చెప్పారు. లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా షూటింగ్ చేసి అద్భుతమైన అవుట్పుట్తో సినిమా తీశామని శరత్ మరార్ చెప్పారు. ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘శివ’ విడుదలైన అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ విడుదలకావడం ఆనందంగా ఉందని, యాక్షన్ ఎంటర్టైనర్గా అలరిస్తుందని పుస్కూర్ రామ్మోహన్ రావు తెలిపారు.