అఖిల్ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచగా,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రం మంచి హిట్ ఇచ్చింది. ఈ విజయంతో అక్కినేని ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాగార్జున ఇప్పుడు ఫుల్ జోష్ తో ఉన్నారు. ఇకపై తనయుడి విషయంలో నాగ్ కి మరింత బాధ్యత పెరిగింది. ముందు నుంచి అఖిల్ చేసే సినిమాల విషయంలో నాగ్ అవసరం మేర ఇన్వాల్వ్ అయ్యారు. స్క్రిప్ట్ నాగ్ విన్న తర్వాతే అఖిల్ వరకూ వెళ్లేది. ఆ కాన్ఫిడెన్స్ తో నే అఖిల్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ చేతుల్లో పెట్టారు.
అరవింద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో తన కొడుక్కిమంచి హిట్ దక్కిన నేపథ్యంలో నాగార్జున బ్యాచిలర్ టీమ్ కి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గీతా ఆర్స్ట్ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించి స్పెషల్ గా ట్రీట్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారట. ఇటీవలే ఏఎమ్బీ టీం మొత్తం యూనిట్ కి అఖిల్ కూడా పార్టీ ఇచ్చాడు.
బ్యాచిలర్ సక్సెస్ మీట్ తర్వాతి రోజున అఖిల్ తన టీమ్ అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసాడు. ఈ పార్టీకి అఖిల్ స్నేహితులు.. కొందరు పరిశ్రమ వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు నాగార్జున .. చిరంజీవి.. చరణ్ సహా మెగా హీరోలందరిని పిలిచే అవకాశం ఉందని సమాచారం.