నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్మరార్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ను జూన్ తొలివారంలో ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్లో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్లో నాగార్జున, కాజల్ అగర్వాల్లపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని సమాచారం. తొలి షెడ్యూల్ను గోవాలో పూర్తిచేశారు. ఈ సినిమాలో నాగార్జున మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని..హైదరాబాద్లో పాటు ఊటీ, లండన్, దక్షిణ కొరియాలో ముఖ్యఘట్టాల్ని తెరరకెక్కిస్తామని చితబృందం తెలిపింది.