Dhanush-Sekhar Kammula Movie | సార్తో తెలుగులో యాభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి తిరుగులేని మార్కెట్ను పెంచుకున్నాడు ధనుష్. ప్రస్తుతం ఆయన సినిమాలకు ఇక్కడ మాములు గిరాకీ లేదు. కెప్టెన్ మిల్లర్ కోసం ఇప్పటి నుంచే తెలుగు నిర్మాతలు కాచుకొని చూస్తున్నారు. డబ్బింగ్ హక్కుల కోసం ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక శేఖర్ కమ్ములతో చేయబోయే సినిమాకైతే మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు. అనౌన్స్మెంట్ ఇచ్చేసి నెలలు గడిచిపోయింది. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అమితాసక్తితో ఎదురు చూస్తు్న్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం కేప్టెన్ మిల్లర్తో తాను స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు పూర్తవ్వగానే శేఖర్ కమ్ములా సినిమా కోసం సిద్ధం కానున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ చేస్తుంది. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం నాగార్జునను సంప్రదించినట్లు తెలుస్తుంది. సినిమా నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్కు నాగార్జునకు మధ్య మంచి బాండింగ్ ఉంది. దాంతో కీలకపాత్ర చేయడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ను సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారు. ధనుష్కు జోడీగా రష్మిక నటించబోతున్నట్లు టాక్.