Big Boss 7 | ఇప్పటికీ చాలా మంది నాగచైతన్య, సమంత కలిస్తే బాగుండు అని అనుకుంటుంటారు. అంతలా వాళ్లను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. తొలిసినిమా ‘ఏ మాయ చేశావే’తోనే వీళ్లిద్దరూ బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ బెస్ట్ పెయిర్ అనిపించుకోవాలని ఆరేళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి అప్పట్లో దక్షిణాదిలో హాట్ టాపిక్ అయింది. అయితే వీళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగానే సాగింది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి బిజీ లైఫ్లో వారున్నారు. విడాకుల తర్వాత అటు అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఇద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి.
అయితే తాజాగా నాగార్జున సమంత గురించి అడిగి అందరినీ షాక్కు గురిచేశాడు. ఆదివారం బిగ్బాస్ 7 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు విజయ్తో పాటు నవీన్ పొలిశెట్టి గెస్ట్లుగా వచ్చారు. కాగా ఖుషీ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ ఆరాధ్య అనే పాటకు లైవ్ పర్ఫర్మామెన్స్ కూడా ఇచ్చాడు. అయితే నాగార్జున, విజయ్తో మాట్లాడుతుండగా.. విజయ్ మీ హీరోయిన్ సమంత ఎక్కడా అంటూ అనేశాడు. దాంతో ఆడిటోరియం మొత్తం హోరెత్తింది. షో మట్టుకు ఎంత ప్రొఫెషనల్ అయినా.. నాగార్జున ఇలా సమంత గురించి అడుతారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు.
నాగార్జున వరుసగా ఐదో సారి హోస్ట్గా చేస్తున్న బిగ్బాస్ 7వ సీజన్ లాంచ్ ఈవెంట్ నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సీజన్ 7లో 14 మంది కంటెస్టెంట్లు హౌజ్లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్ సరికొత్త టాస్క్లతో ఆసక్తిరంగా సాగనుందట. 14 కంటెస్టెంట్ల మధ్య పోటీ హోరా హోరీగా సాగతుందట.