అక్కినేని నాగార్జునకు ఈ ఇయర్ మెమోరబుల్ కానుంది. అందుకు కారణం ఆయన తనయులు నటించిన లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు మంచి విజయం సాధించడమే. చైతూ లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో నాగార్జున ఫుల్ ఖుష్గా ఉన్నాడు. అయితే నాగ్ తన ఇద్దరు కొడుకులతో కలిసి నటించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది.
ఇప్పటికే మనం సినిమాలో నటించిన చైతూ ఈసారి బంగార్రాజు సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్దం అయ్యాడు. బంగార్రాజు సినిమా లో చైతూ మరియు నాగార్జునల మద్య ఉండే సన్నివేశాలు ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయనే నమ్మకంతో అక్కినేని అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు ప్రవీణ్ సత్తారు- నాగార్జున కాంబినేషన్లో రూపొందనున్న ఘోస్ట్ చిత్రంలో అఖిల్ నటించబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. అదే నిజమైతే అసలు అఖిల్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడోనని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఘోస్ట్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.