నాగచైతన్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్నివ్వగా, రానా దగ్గుబాటి కెమెరా స్విఛాన్ చేశారు.
‘దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన తనయుడు యువన్శంకర్ రాజా స్వరాల్ని సమకూర్చడం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతాం. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తా’ం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: ఇళయరాజా, యువన్శంకర్ రాజా, సమర్పణ: పవన్కుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు.