‘నేను సినీపరిశ్రమలోకి వచ్చిందే ప్రేక్షకులను మెప్పించడానికి, అందులో భాగంగా కొన్ని రిస్క్లు తీసుకోవాల్సి వస్తుంది’ అంటున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య. ఆయన తన తాజా చిత్రం ‘రంగబలి’విజయంపై పూర్తి కాన్ఫిడెంట్గా వున్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య విలేకరుల సమావేశంలో ‘రంగబలి’ విశేషాలని పంచుకున్నారు.
ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ రోజు మొదలుపెట్టడమే చాలా ఎనర్జీతో పాజటివ్గా వుంటుంది.అలాగే ఈ సినిమా చూసిన తరువాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. సినిమా చూసిన తరువాత వచ్చిన నమ్మకంతోనే ఇంత కాన్ఫిడెంట్గా వున్నాను. ప్రేక్షకులకు సినిమా గురించి ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను.
నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రార్డినరీగా యాక్టింగ్, డ్యాన్స్, యాక్షన్ అన్నీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనమూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కొక్కసారి గాయాలు అవుతాయి. మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది.
ఎవరి నిర్మాణ సంస్థలోనైనా పది సినిమాలు హిట్టు పడిన తరువాత కూడా ఒక సినిమా నిరాశపరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే పిచ్చి ప్యాషన్తో సినిమాలు నిర్మిస్తున్నాం. తప్పితే డబ్బులు సంపాందించుకోవాలని కాదు మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం..మాకు అది తప్పితే వేరేదీ తెలీదు.
మన ఊర్లో మనం తోపు అని అందరికి తెలుసు. అలా తన సొంత ఊరులో తోపులా ఫీలయ్యే కుర్రాడి కథ. సొంత ఊరు అనే ఫిలింగ్ వేరు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మళ్లీ మన రూట్స్ని టచ్ చేసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది.
ఎవరూ కథని జడ్జ్ చేయలేమని నా అభిప్రాయం. నిజానికి మనం జడ్జ్ చేయాల్సింది దర్శకుడిని. తను ఎలా తీయగలడు అనేది చూడాలి. ఒక సీక్వెన్స్ని ఎలా తీస్తావని అడిగినప్పుడు వాళ్లు చెప్పే సమాధానం బట్టి కొంత జడ్జ్మెంట్లోకి రావచ్చు.