నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. ఈ సినిమా చివరి షెడ్యూల్ గురువారం హైదరాబాద్లో పునఃప్రారంభమైంది. నాయకానాయికలపై శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఓ జంట పరిచయం నుంచి పరిణయం వరకు జరిగే ప్రయాణానికి దృశ్యరూపంగా ఉంటుంది. వినోదానికి పెద్దపీట వేశాం’ అని చిత్రబృందం తెలిపింది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: విశాల్చంద్రశేఖర్, మాటలు: గణేష్ కుమార్ రావూరి, సమర్పణ: పీడీవీ ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.