యువ హీరో నాగశౌర్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం హైదరాబాద్లో తన కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. యూనిట్ సభ్యులు ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగశౌర్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. సినిమాకు కావాల్సిన శరీరాకృతి కోసం ఎక్కువగా వ్యాయామాలు చేయడం వల్ల నాగశౌర్య డీహైడ్రేషన్కు గురయ్యారని, అందుకే కళ్లు తిరిగి పడిపోయారని తెలుస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో ఆయన తిరిగి షూటింగ్ హాజరవుతారని సమాచారం. ప్రస్తుతం నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’, ‘పోలీసు వారి హెచ్చరిక’, ‘నారీ నారీ నడుమ మురారి’, ఎన్ఎస్ 24 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయనకు పెళ్లి కుదిరింది. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో ఈ నెల 20న వివాహం జరగనుంది.