శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త పాయింట్స్తో రూపొందగా, ఇందులో సాయిపల్లవి డాన్స్ కూడా సినిమాలో చాలా హైలెట్ గా నిలిచాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో కనిపించాయి అంటూ చాలామంది సెలబ్స్ కామెంట్స్ చేశారు.
చిత్రంలో చైతు – సాయి పల్లవిల కెమిస్ట్రీతో పాటు లవ్ సీన్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఓ సీన్లో, అలాగే ‘ఏయ్ పిల్లా’ పాటలోనూ సాయి పల్లవి, చైతుకి ముద్దు పెడుతుంది. సాధారణంగా కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయి పల్లవి ఇటీవల ముద్దు సీన్పై క్లారిటీ ఇచ్చింది. నేనెప్పుడూ కూడా ముద్దు సీన్లలో యాక్ట్ చెయ్యలేదు.. అలాంటి సీన్స్లో నటించను అని దర్శక నిర్మాతలకు ముందే చెప్పేస్తాను. సినిమాలో నేను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదు. అది కెమెరామెన్ ట్రిక్ అని పేర్కొంది.
అయితే సాయి పల్లవి ముద్దు పెట్టినప్పుడు చైతూ ముఖంలో భావోద్వేగాలు స్పష్టంగా వచ్చేంత వరకు సీన్ షూట్ చేశారట.దీని కోసం దాదాపు ఆరుగంటల సమయం పట్టిందని చెబుతున్నారు. చిత్రంలో కీలకమైన సన్నివేశం ఇదే కావడంతో సరైన ఎక్స్ప్రెషన్స్ వచ్చే వరకు చైతూని ఎవరు ఇబ్బంది పెట్టొద్దని శేఖర్ కమ్ముల సూచించాడట. అయితే ఈ సీన్కు సూపర్భ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం పడ్డ కష్టాన్ని మరచిపోయింది.