ఓ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నారు హీరో నాగ చైతన్య. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ 22వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని, త్వరలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాత తెలిపారు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. దీంతో పాటు దూత అనే వెబ్ సిరీస్లోనూ ఆయన నటిస్తున్నారు.