సాగర్ ఓ సక్సెస్ఫుల్ జర్నలిస్ట్. ఊహించని సంఘటనలు, మిస్టీరియస్ మరణాలు, అతీంద్రియ సంఘటనలు తననీ తన కుటుంబాన్ని వేధిస్తుంటాయి. ఆ తర్వాత ఏమైంది? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన ఎనిమిది ఎపిసోడ్ల వెబ్ సీరీస్ ‘దూత’. అక్కినేని నాగచైతన్య టైటిల్రోల్ పోషిస్తున్న ఈ సిరీస్లో పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ ఇతర పాత్రధారులు. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. శరత్మరార్ నిర్మాత. డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఉత్కంఠను కలిగించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇదని, నాగచైతన్య, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ ప్రాణంపెట్టి చేశారని ప్రైమ్ వీడియో అపర్ణ పురోహిత్ అన్నారు. అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం ఈ ‘దూత’ వెబ్సిరీస్ అని, విక్రమ్ కె.కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడని, మంచి నటీనటులు, సాంకేతికనిపుణులు పనిచేసిన ఈ సిరీస్ తప్పక ఆదరణ పొందుతుందని నిర్మాత శరత్ మరార్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీకోలజ్ సైగులు, సంగీతం: ఇషాన్ చాబ్రా.