Naga Chaitanya- Samantha | హైదరాబాద్లో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ వేడుక సినీ, రాజకీయ వర్గాల సమక్షంలో ఘనంగా జరిగింది. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర తారలు విచ్చేసి కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాజీ జంట సమంత మరియు నాగ చైతన్య ఒకే వేదికపై కనిపించడం. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరు కావడం అరుదైన విషయం కావడంతో అందరి దృష్టి వారిపైనే నిలిచింది.
సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఆమె ఊదా రంగు చీరలో మెరిసిపోగా, రాజ్ ఫార్మల్ సూట్లో కనిపించారు. మరోవైపు నాగ చైతన్య తన భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో పాటు తండ్రి నాగార్జున, తల్లి అమలతో కలిసి కార్యక్రమానికి వచ్చారు. శోభితా నీలం-గులాబీ రంగు చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై కొత్త జంటను ఆశీర్వదించే సమయంలో నాగ చైతన్య-శోభిత జంట కెమెరా కళ్లకు చిక్కగా, సమంత-రాజ్ జంట కూడా ప్రత్యేకంగా కనిపించింది. అయితే సమంత, నాగ చైతన్య ఒకరినొకరు పలకరించుకున్నారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
“వీరిద్దరూ కలిశారా?”, “మాట్లాడుకున్నారా?” అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు వారిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకపోవడంతో ఈ విషయం ఇంకా మిస్టరీగానే మిగిలింది. అదే సమయంలో నెటిజన్లు మాత్రం గతాన్ని పక్కన పెట్టి ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగడం మంచి విషయమని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏ మాయ చేసావె సినిమాతో పరిచయమైన సమంత-నాగ చైతన్య 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల 2021లో విడిపోయారు. అనంతరం నాగ చైతన్య 2024లో శోభితను వివాహం చేసుకోగా, సమంత 2025లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ’ అనే సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్తో బిజీగా ఉండగా, సమంత ‘మా ఇంటి బంగారం’, ‘రక్త బ్రహ్మాండం’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.