Custody Movie Promotions | వచ్చే వారం విడుదల కాబోతున్న ‘కస్టడీ’ సినిమా కోసం నాగచైతన్య తీరిక లేకుండా ప్రమోషన్లు చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి హపే తీసుకొచ్చాయి. దానికి తోడు నాగచైతన్య గత రెండు, మూడు రోజుల నుంచి తీరిక లేకుండా వరుస ప్రమోషన్లు జరుపుతూ జనాల్లోకి సినిమాను తీసుకెళ్తున్నాడు. ప్రమోషన్లలో సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకుంటూ ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వూలో పరుశురాంతో సినిమా గురించి మాట్లాడాడు.
గీతాగోవిందం తర్వాత పరుశురాం, నాగచైతన్యకు ఓ లైన్ చెప్పాడని.. చైకు లైన్ బాగా నచ్చడంతో కథను సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ లోపు మహేష్తో ‘సర్కారు వారి పాట’ చేసే అవకాశం రావడంతో చైతన్యతో ప్రాజెక్ట్ను పక్కన పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఇక సర్కారు వారిపాట రిలీజైన తర్వాత మళ్లీ నాగచైతన్యకు కలిసి నాగేశ్వరరావు అనే టైటిల్తో ఓ కథను చెప్పాడట. అయితే చైతన్యకు అది అంతగా నచ్చకపోవడంతో నో చెప్పాడట. ఇక దీనిపై తాజాగా చైతన్య నోరు విప్పాడు. ‘పరుశురాం గురించి మాట్లాడటం వేస్ట్. ఆయన నా టైమ్ను వేస్ట్ చేశాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో చైతన్యకు, పరుశురామ్కు విభేదాలు తలెత్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించింది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదలవుతుంది.