Naga Chaitanya Next Movie | యువ సామ్రాట్ నాగచైతన్య సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ స్టోరీ తర్వాత ఇప్పటివరకు చైతన్యకు సాలిడ్ హిట్ లేదు. నాగ్తో కలిసి చేసిన బంగార్రాజు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోకుండానే వెనుదిరిగింది. ఇక థ్యాంక్యూ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. అక్కినేని అభిమానులు సైతం ఈ సినిమా రిజల్ట్ను జీర్ణించుకోలేకపోయారు. ఇక రీసెంట్గా వచ్చిన కస్టడీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది. కొన్ని ఏరియాల్లో పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాంతో నాగచైతన్య ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
చైతన్య తన తదుపరి సినిమాను చందు ముండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు వచ్చేశాయి. ఈ సినిమా మత్య్సకారుల నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. చైతన్య ఇందులో ఫిషర్ మేన్గా కనిపించనున్నాడు. రేపో మాపో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమా కథ శ్రీకాకుళం తీరం నుంచి పాక్ తీరం వరకు సాగుతుందట. శ్రీకాకుళం మత్స్యకారులు రూట్ తప్పి పాకిస్థాన్కి వెళ్లిపోతారట. అక్కడ పాకిస్థాన్ సైనికుల చేతికి చిక్కి చిత్రహింసలు పడుతుంటారట. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు వాళ్లను తిరిగి ఇండియాకు తీసుకొస్తారట.
ఇదే కాన్సెప్ట్తో సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని పలువురు నెటిజన్లు తెలుపుతున్నారు. దీని కోసం గీతాఆర్స్ట్ సంస్థ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా చైతన్యకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతుందని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.