Prabhas | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్అశ్విన్ దర్శకుడు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మే 8న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తాలూకు తాజా అప్డేట్ వెలువడింది. ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ప్రభాస్, దిశాపటానీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుందరమైన లొకేషన్లలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారని, విజువల్స్ అబ్బురపరుస్తాయని చెబుతున్నారు.
మహాభారత కాలంలో మొదలై 2898 కాలంలో ఈ చిత్ర కథ ముగుస్తుందని దర్శకుడు నాగ్అశ్విన్ ఇటీవల ఈ సినిమా తాలూకు కథ గురించి తెలిపారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా ఆగమనం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక హంగులతో వైజయంతీ మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్, కమల్హాసన్, దీపికా పడుకోన్ వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.