యువ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రస్తుతం ప్రాజెక్టు కే (Project K) షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ పోషిస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా మీ డౌటు. నాగ్ అశ్విన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సాయం తీసుకుంటున్నాడు. దీనికి నాగ్ అశ్విన్ పెట్టిన ట్వీటే ఉదాహరణ.
‘డియర్ ఆనంద్ మహీంద్రా సార్..మిస్టర్ బచ్చన్, ప్రభాస్, దీపికాతో కలిసి మేం ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో ప్రాజెక్టు కే చేస్తున్నాం. ఈ ప్రపంచం కోసం యూనిక్ అండ్ టెక్నాలజీని మించిని కొన్ని వాహనాలను డిజైన్ చేస్తున్నాం. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ఇ సాధిస్తే అది మన జాతికే గర్వకారణం. మీరు మంచి టాలెంట్ ఉన్న ఇంజినీర్లు, డిజైనర్లు మీ దగ్గర ఉన్నారు. ప్రాజెక్ట్ K లాంటి సినిమా గతంలో ఎన్నడూ ప్రయత్నించలేదు..భవిష్యత్తును ఇంజినీర్గా చేయడానికి మీరు మాకు సహాయం చేయగలిగితే అది గౌరవంగా ఉంటుంది..’అని ట్వీట్ చేశాడు.
I admire you a lot sir..v have a talented, fully Indian team of engineers and designers..but the scale of the project is such that we could use a hand..such a film has never been attempted before…it would be an honor if you can help us engineer the future… #ProjectK
— Nag Ashwin (@nagashwin7) March 4, 2022
అయితే యంగ్ డైరెక్టర్ విజ్ఞప్తికి ఆనంద్ మహీంద్రా మాత్రం ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్ పై ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.