డైరెక్టర్ నాగ్ అశ్విన్కి కోపం వచ్చింది. ‘నేనేం తీస్తున్నానో నాకు తెలుసు..’ అంటూ తనపై వస్తున్న విమర్శలపై ఆయన గట్టిగా బదులిచ్చారు. వివరాల్లోకెళ్తే.. ‘కల్కి 2898ఏడీ’ ైక్లెమాక్స్లో ప్రభాస్ని కర్ణుడిగా చూపించి, ఆడియన్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు నాగ్ అశ్విన్. అయితే.. కర్ణ పాత్రను ఆయన చూపించిన తీరుపై కొందరు నెటిజన్లు, మేధావులు విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ నెటిజన్.. ‘కల్కి 2898ఏడీ’లో కర్ణుడి పాత్రను గొప్పగా చూపిస్తూ, మహాభారతంలో లేని అంశాలను కూడా ప్రస్తావించారంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. దానిపై నాగ్ అశ్విన్ ఘాటుగా స్పందించారు. ‘ద్రోణ వధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి కృష్ణుడు స్వయంగా చెప్పాడు.
ఈ విషయం మీకు తెలియాలంటే వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతం పుస్తకాన్ని ఓసారి చదవండి. ఒకవేళ మీకు అది చదవడం కుదరని పక్షంలో ‘శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుడ్ని ఎన్నిమార్లు పొగిడాడు?’ అని గూగుల్ సెర్చ్ చేయండి. నేనేం తీస్తున్నానో నాకు తెలుసు. మన పురాణాలు, చరిత్రపై నాకు అపారమైన గౌరవం ఉంది. దయచేసి ‘కల్కి 2’ కోసం వేచి చూడండి’ అంటూ వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని ఆ నెటిజన్కు నాగ్ అశ్విన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.