Naa Saami Ranga | అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చాలా రోజుల తర్వాత నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్తో పాటు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి పార్టీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.
సీసా మూత ఇప్పు అంటూ సాగే లిరికల్ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే ప్రేమ బండి చలో అంటే.. రైస్ మిల్లు నెల జీతం రయి రయి మని పెరిగిందంటే ఫేవరేట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్ పడిందంటే.. ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే.. పక్కింటోడికి లాస్ వస్తే.. వాడిని ఓదార్చే ఛాన్స్ వస్తే.. ఎం సెయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు.. ఎం సెయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు అంటూ ఫుల్ ఎనర్జీటిక్గా ఈ పాట సాగింది.
ఇక ఈ పాటను ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ రాయగా.. మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్. అరుణ్ కౌండియా కలిసి అలపించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.