Naa Saami Ranga | టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత నాగార్జునకు హిట్ పడడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+ హాట్స్టార్ వేదికగా ఈ సినిమా ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రయూనిట్ అఫీషియల్గా ప్రకటించింది. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించాడు. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కించారు.
Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960-80మధ్య కాలంలో గోదావరి, అంబాజీపేట నేపథ్యంలో సాగే కథ ఇది. కిష్టయ్య( నాగార్జున) అంజి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లానే వుంటారు. ఆ ఊర్లో వడ్డి వ్యాపారం చేసే వరదరాజులు( రావు రమేష్) కూతురు వరాలు( అషికా రంగనాథన్) కిష్టయ్య ప్రేమించుకుంటారు. అయితే అనుకోని ఓ ఘటన వాళ్ళ పెళ్ళికి అడ్డంకిగా మారుతుంది. మరి ఈ ఇద్దరి పెళ్లి జరిగిందా ? వీళ్ళ పెళ్లికి వున్న అడ్డంకి ఏమిటి? ఈ కథలో పెద్దయ్య( నాజర్) భాస్కర్ (తరుణ్ భాస్కర్) మంగ( మిర్నా మీనన్) కుమారి( రుక్సర్) పాత్రల ప్రాధాన్యత ఏమిటి ? కిష్టయ్య, అంజి పాత్రల ప్రయాణం ఏ తీరాలకు చేరింది? కిష్టయ్య ప్రేమకథకు మిగింపు దొరికిందా ? ఇవన్నీ తెరపై చూడాలి.