Vijay Deverakonda | నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చుట్టూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. షూటింగ్ సెట్స్లో విజయ్ దేవరకొండ తన కోసం 5 నుంచి 6 కారవాన్లు, 40-50 మంది అసిస్టెంట్లను డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ను ఆశ్రయించారంటూ కొన్ని నకిలీ స్క్రీన్షాట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ తప్పుడు ప్రచారంపై చిత్ర నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ స్పందించారు. విజయ్ దేవరకొండ చాలా ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారని, షూటింగ్లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ టీమ్ కూడా ఇవి కావాలనే చేస్తున్న తప్పుడు ప్రచారాలని, వీటిని సృష్టించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక ‘రణబాలి’ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. 1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలన నాటి వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ‘ది మమ్మీ’ సినిమా విలన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో ప్రధాన విలన్గా నటిస్తుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.