పంకజ్ త్రిపాఠి, సారా అలీఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సోహైల్ నయ్యర్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘మర్డర్ ముబారక్’. హోమీ అడజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్నది.
ఈ మిస్టరీ థ్రిల్లర్ నేరుగా ఓటీటీ వేదికగా ప్రదర్శితం కానున్నది. ఈ సినిమా ఫస్ట్లుక్ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. మార్చి 15 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అనూజా చౌహాన్ రాసిన పుస్తకం ‘క్లబ్ యు టు డెత్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి కేసు దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్గా నటించారు.