Mrunal Thakur | కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఎన్నో తిరస్కారాలు తనలో పట్టుదలను పెంచాయని, వాటన్నింటినీ ఛాలెంజ్గా తీసుకొని పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది కథానాయిక మృణాల్ ఠాకూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ భామ ఇండస్ట్రీలో తన తొలినాటి రోజుల్ని గుర్తుచేసుకుంది.
‘ఆడిషన్స్కు వెళ్లిన చాలా సందర్భాల్లో నేను నటనకు పనికిరానని చెప్పేవారు. ఆ మాటలు నాలో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా సరే సినీ రంగంలో రాణించాలనుకున్నా. ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకుంటూ నా నటనను మెరుగుపరచుకున్నా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ స్థాయికి వచ్చాను.
నన్ను తిరస్కరించిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. వారి వల్లే మరింత పట్టుదలతో కెరీర్ను తీర్చిదిద్దుకున్నా’ అని మృణాల్ ఠాకూర్ చెప్పింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటామని, ‘సీతారామం’ చిత్రంలో సీతామహాలక్ష్మీ పాత్రను ప్రాణం పెట్టి చేశానని, అందుకే ఆ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోయిందని ఈ భామ చెప్పుకొచ్చింది. ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.