సినీ రంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం హీరోల చుట్టే తిరుగుతుంది. నాయికల రెమ్యునరేషన్స్ గురించి అంతగా పట్టింపు ఉండదు. ప్రస్తుతం మహిళా ప్రధాన కథాంశాల రూపకల్పన ఎక్కువ కావడంతో పారితోషికాల చర్చలో కథానాయికలు కూడా భాగమవుతున్నారు. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్కు సంబంధించి ఇటీవల ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ పాల్గొంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రెమ్యునరేషన్స్ విషయంలో హీరోయిన్స్ నిక్కచ్చిగా వ్యవహరించాలని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ప్రేక్షకుల్లో మనకున్న ఇమేజ్ను బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే చాలా మంది నాయికలు తాము కోరుకున్న పారితోషికాల్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో అర్థమవుతుంది’ అని పేర్కొంది.