నాగవర్మ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకుడు. దివ్యాసురేష్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘కలయా నిజమా’ అనే గీతాన్ని గేయరచయిత చంద్రబోస్ విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘సంగీతభరిత ప్రేమకథ ఇది. విక్రమ్ అనే సినీ రచయిత జీవితంలో ఏం జరిగింది? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం అతడు ఏం చేశాడన్నది ఉత్కంఠను పంచుతుంది’ అన్నారు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదలచేస్తామని దర్శకుడు పేర్కొన్నారు.