అమరావతి : మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన భేటీ వ్యక్తిగతం అంటూనే పేర్ల ప్రస్తావన తీసుకు రాకుండా వారిపై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చిరంజీవి ఆధ్వర్యంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఏపీ సీఎం తో భేటీ అయ్యారు. అయితే భేటీకి తన తండ్రి మోహన్బాబుకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపిందని విష్ణు పేర్కొన్నారు. అయితే ఆ ఆహ్వానం మా నాన్నకు చేరలేదని ఆరోపించారు.
ఆహ్వానం చేరకుండా ఎవరు చేశారో తెలుసని అన్నారు. సీఎంతో భేటీలో సినీ రంగానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నామని వెల్లడించారు. తిరుపతిలో ఫిల్మ్ స్టూడియో పెడతానని ప్రకటించారు. ఇండస్ట్రీ విశాఖకు వెళ్లే విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని విష్ణు వివరిం చారు.