Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ యాంకర్ సుమ, ఆమె కుమారుడు రోహన్, సింగర్ సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు.