కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. యుద్ధ నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సిరుతై శివ రూపొందిస్తున్నారు. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పది భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న గెటప్లలో కనిపించనున్నారు. బాలీవుడ్ తార దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ నాయికలుగా నటిస్తున్నారు. త్రీడీ ఫార్మేట్లో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ను ఈ నెల 16వ తేదీన ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. ఈ చిత్రానికి వీర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతేడాది ‘సురరై పోట్రు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న సూర్య..ఆ ఉత్సాహంలో క్రేజీ ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు.