అక్షర శిల్పి సిరివెన్నెల సీతారామశాస్త్రి రీసెంట్గా లంగ్ క్యాన్సర్తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి సాహిత్య లోకానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. కొన్ని రోజుల కింది వరకు ఆరోగ్యంగా ఉన్న ఈయన.. వారం రోజుల్లోనే అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లడం, అక్కడ నుండి జీవం లేకండా బయటకు రావడం ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. సరస్వతి పుత్రుడు దూరం అయిపోయాడని.. ఆయన పాటలు ఎప్పటికీ అజరామరం అంటూ అంతా సిరివెన్నెల ధ్యాసలోనే ఉన్నారు.
తెలుగుపాటకు కోట కట్టిన సిరివెన్నెల సీతారామశాస్త్రికి అభిమానులు తుది వీడ్కోలు పలికారు. ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, మహేష్బాబు, నాగార్జున, ఎన్టీఆర్, పవన్కల్యాణ్, రాజశేఖర్, తివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, రానా, నాని, సుధీర్బాబు, నాగబాబు, శర్వానంద్, వరుణ్సందేశ్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, ఆర్పీ పట్నాయక్, శివబాలాజీ, నరేశ్, జగపతిబాబు తదితర సినీ ప్రముఖులు సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
ఆరోజు ఎక్కడా మోహన్ బాబు ఫ్యామిలీ కనిపించలేదు.. దీంతో మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదు అని అభిమానుల్లో అనుమానం వ్యక్తం అయ్యింది.దీనిపై తాజాగా వివరణ ఇచ్చారు మోహన్ బాబు. సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. మా ఇంట్లో నా తమ్ముడు మృతిచెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెళ్లకూడదు.. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని.. సినిమా పరిశ్రమలో వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం విషాదంగా మారుతుందని తెలిపారు మోహన్ బాబు.