MegaStar Chiranjeevi | టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఆయన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022గా ఎంపికయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
‘మై డియర్ చిరంజీవి. గోవాలో జరుగుతున్న ఇఫీ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోబోతున్నందుకు అభినందనలు. షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో మీరు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబు ట్వీట్కు చిరంజీవి స్పందించారు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Congratulations to my dear @KChiruTweets on being honored at @IFFIGoa. Wishing you many more laurels with the blessings of Sri Shirdi Sai Baba
— Mohan Babu M (@themohanbabu) November 22, 2022