సీనియర్ హీరో మోహన్ బాబు, ఆయన తనయ మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాలో నటించనున్నారు. మలయాళ నటుడు సిద్ధిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డైమండ్ రత్నబాబు కథా మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ తెరకెక్కించనున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ..‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. మోహన్ బాబును కొత్త పాత్రలో చూస్తారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాం’. అన్నారు.