ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాధం నెలకొంది. ఆయన మాతృమూర్తి భానుమతి బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
సాయంత్రం కుటుంబ సభ్యులు భానుమతి భౌతిక కాయాన్ని కీరవాణి స్వగృహానికి తరలించారు. ఈ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు కీరవాణి వెళ్లి భానుమతి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.