ఐదు విభిన్న కథలతో తెరకెక్కుతున్న ఆంథాలజీ చిత్రం ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్ దర్శకుడు. నోయెల్, నందినిరాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు . డి.మధు నిర్మాత.
ఈ చిత్రం ట్రైలర్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎ.కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ వేరు వేరు జోనర్లలో విభిన్న కథలతో సినిమాను రూపొందించడం ఆసక్తిగా వుంది. ట్రైలర్ బాగుంది. పాత్రలు కూడా చాలా కొత్తగా వున్నాయి. మా ఫ్యామిలీ మెంబర్ అయిన నోయల్ నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, మాటలు, లైన్ప్రొడ్యూసర్: అజహార్ షేక్.