Mission Raniganj | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshya Kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్(Mission Raniganj). ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక (The Great Bharat Rescue). బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (parinithi chopra) కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ (Tinu Suresh Deshayi) దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వశ్ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ‘కీమ్తి’ అనే రొమాంటిక్ ట్రాక్ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాట పంజాబీ వైబ్ ఇస్తుంది. రొమాంటిక్ మెలోడీగా ఉన్న ఈ పాటకు కౌశల్ కిషోర్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టైటిల్ను మారుస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ అని ఉన్న ఈ మూవీ టైటిల్ను “మిషన్ రాణిగంజ్” (Mission Raniganj) ది గ్రేట్ భారత్ రెస్క్యూ గా పేరు మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు.
AKSHAY KUMAR – PARINEETI CHOPRA: ‘MISSION RANIGANJ’ NEW SONG IS HERE… 6 OCT RELEASE… Team #MissionRaniganj – starring #AkshayKumar and #ParineetiChopra – unveils new song: #Keemti.
Directed by #TinuSureshDesai… Produced by #VashuBhagnani, #DeepshikhaDeshmukh, #JackkyBhagnani… pic.twitter.com/gVvYfTlwyP
— taran adarsh (@taran_adarsh) October 3, 2023
1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ (Jaswanth Singh gill) అనే మైనింగ్ ఇంజనీర్ బొగ్గు గనుల్లో చిక్కుకున్న 64 మందిని కార్మికులను కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ (Akshya Kumar) కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 06న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇక కేసరి (Kesari) వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత అక్షయ్, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్, వరుణ్ బడోలా, దిబ్యేందు భట్టాచార్య, రాజేష్ శర్మ, వీరేంద్ర సక్సేనా, శిశిర్ శర్మ, అనంత్ మహదేవన్, జమీల్ ఖాన్, సుధీర్ పాండే, బచన్ పచేరా, ఓంకర్ భట్ మణి, ఓంకర్ భట్ మణి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.