దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’. ఓటీటీ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కథ ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో త్వరలో థియేటర్లలోకి భారీ స్థాయిలో రానున్నది. 2018లో మొదలైన ‘మీర్జాపూర్’ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆసక్తికరమైన కొత్త కథతో సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డ బబ్లు పండిట్ పాత్రలో జితేంద్రకుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే రవికిషన్ కొత్త పాత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చింది. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కథ: పునీత్ కృష్ణ, నిర్మాతలు: రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, దర్శకత్వం: గుర్మీత్ సింగ్, నిర్మాణం: ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటైర్టెన్మెంట్స్.