హైదరాబాద్ : సినీ నటుడు తారకరత్న పార్థీవదేహానికి తెలంగాణ పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారకరత్న తండ్రి మోహనకృష్ణ, బాలకృష్ణ, కల్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని పరామర్శించారు. ఈ సందర్భంగా తారకరత్న మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు.