విక్రాంత్, మెహరీన్ జంటగా నటిస్తున్న ‘స్పార్క్’ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎంపీ రంజిత్ రెడ్డి క్లాప్నిచ్చారు.
ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ అరవింద్కుమార్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘యాక్షన్ థ్రిల్లర్ ఇది. తొలి షెడ్యూల్ను హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో జరుపుతాం. వైజాగ్, డార్జిలింగ్, ముంబయి, గోవాలో మిగిలిన షెడ్యూల్స్ పూర్తిచేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.