Chiranjeevi Next Movie | ‘ఖైదీ నెంబర్150’తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘సైరా’ తెలుగులో నెట్టుకొచ్చింది కానీ, మిగితా భాషల్లో కనీసం పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కు తీసుకరాలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో చిరు ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఆచార్యతో గతేడాది ఏప్రిల్లో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కొడుకు చరణ్తో కలిసి చేసిన తొలి సినిమా కావడంతో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
పైగా కొరటాల వంటి ఫ్లాప్ ఎరుగని దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా పేరెత్తితేనే భయపడిపోతుంటారు. అంతలా ‘ఆచార్య’ డిసప్పాయింట్ చేసింది. ఇక ఈ గాయం నుండి కోలుకునేలోపే మెగా అభిమానులకు ‘గాడ్ఫాదర్’ రూపంలో మరో దెబ్బ పడింది. ఓ మోస్తరు అంచనాలతో దసరా కానుకగా రిలీజైన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. దాంతో వారం తిరక్కుండానే సగం థియేటర్లను ఖాళీ చేసింది. ఇక మెగాస్టార్ పనైపోయింది. ఆయన సినిమాలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సినిమాలకు గుడ్ చెప్పాల్సిన టైమ్ వచ్చింది అంటూ ఎన్నో రకాల విమర్శలు చిరుపై మొదలయ్యాయి.
వాటన్నిటిని దాటుకుంటూ ‘వాల్తేరు వీరయ్య’తో విమర్శలు చేసిన నోళ్ళతోనే ప్రశంసలు అందుకున్నాడు. వింటేజ్ చిరు వచ్చాడంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కథ, కథనం పరంగా చూసుకుంటే అంత గొప్ప సినిమా ఏం కాదు. కానీ బాస్లోని కామెడీ టైమింగ్ను బాబీ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. అభిమానులు చిరును ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు. చిరుకు తోడు మాస్రాజా తోడవడంతో సంక్రాంతికి కలెక్షన్ల వరద పారింది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ.50 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.
ఇక ప్రస్తుతం చిరు అదే జోష్తో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వాల్తేరు వీరయ్య సక్సెస్తో ప్రేక్షకులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో చిరుకు క్లారిటీ రావడంతో అప్పటికప్పుడు స్క్రిప్ట్లో కీలక మార్పులు చేయించి భోళా శంకర్ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ముందుగా దసరా విడుదల అనుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో దీపావళికి వచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేస్తాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య వెంకీ కుడుముల-డీవివి బ్యానర్లో చిరు నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించినా.. పలు కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది.
కాగా తాజాగా చిరుకు తన నెక్స్ట్ సినిమాకు దర్శకుడు దొరికేశాడని తెలుస్తుంది. గతేడాది సర్దార్తో కార్తికు వంద కోట్ల బొమ్మనిచ్చిన పీ.ఎస్ మిత్రన్.. చిరు 156వ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని సమాచారం. అయితే కథ మాత్రం బీఎస్ రవి అందించనున్నాడట. అంతేకాకుండా తన కూతురు సుష్మిత స్థాపించిన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను చేస్తున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వారం పది రోజుల్లో ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.