టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరూ చాలా ఈవెంట్స్ కలిసి జరుపుకుంటారు. ఒకరి సంతోషాన్ని మరొకరితో షేర్ చేసుకుంటారు. చిరు, నాగ్ కిచెన్లోకి దూరిన స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
వైల్డ్ డాగ్ విడుదలకు కొన్ని గంటల ముందు నాగార్జున కోసం చిరంజీవి డెలీసియస్ డిన్నర్ ఫుడ్ ను ప్రిపేరు చేశాడు. వైల్డ్ డాగ్ విడుదల నేపథ్యంలో నా టెన్షన్ ను కూల్ చేసేందుకు డిన్నర్ కోసం మెగాస్టార్ డెలీసియస్ వంటకం తయారు చేశారని నాగార్జున ట్విటర్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేశాడు.
మరి నాగ్, చిరు కిచెన్ లో ఉంటే వారిని ఎవరు ఫొటో తీశారనే కదా మీ డౌటు. ఆ కెమెరా క్లిక్మనిపించింది ఎవరో కాదు. చిరు సతీమణి సురేఖ. అద్భుతమైన సాయంత్రాన్ని అందించిన మెగా దంపతులకు నాగార్జున ధన్యవాదాలు తెలియజేశాడు. ఇటీవల చిరంజీవి వైల్డ్ డాగ్ ట్రైలర్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.