Chiranjeevi | సినిమా అయితే మనం స్క్రిప్ట్ ఎలా రాసుకుంటే అలా అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ట్విస్ట్ పెట్టుకోవచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కథను ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ముందు ఏం జరుగుతుందో కూడా మనకు తెలుస్తుంది. కానీ జీవితంలో అలా కాదు కదా.. రియల్ లైఫ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఎంత ప్లానింగ్ చేసుకున్నా టైం కలిసి వస్తాయి కానీ ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వదు. ఇప్పుడు చిరంజీవి విషయంలో ఇదే జరుగుతుంది. ఇప్పటినుంచి వరుస సినిమాలు చేయాలి అని మెగాస్టార్ ప్లాన్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే లాస్ట్ 16 నెలల్లో ఏకంగా నాలుగు సినిమాలు విడుదల చేశాడు. సైరా తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈయన.. 2022 సమ్మర్లో ఆచార్య సినిమాతో వచ్చాడు. దసరాకు గాడ్ ఫాదర్.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య.. మొన్న ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో వచ్చాడు.
చెప్పినట్టుగానే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేశాడు మెగాస్టార్. ఇదే ఊపు కంటిన్యూ చేసి 2024లో కూడా రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు చిరంజీవి. కానీ ఆయన అనుకున్నది ఒక్కటి అక్కడ జరుగుతున్నది మరొకటి. కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా హోల్డ్లో పడిపోయింది. అలాగే వశిష్ట సినిమా కూడా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. దానికి తోడు ఆయన కాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. దానివల్ల కనీసం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ కలిపి చిరంజీవి అనుకున్నది అనుకున్నట్టు జరగనియ్యడం లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2024లో చిరంజీవి నుంచి సినిమా రావడం కష్టమే. డిసెంబర్ నుంచి వశిష్ట సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సోషియో ఫాంటసీ కావడంతో వీలైనంత ఎక్కువ టైం తీసుకోవాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. దానికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ తో కూడా ఎక్కువగా పని ఉంటుంది.. కాబట్టి టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. 2025 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో చిరంజీవి, వశిష్ట సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్యరాయ్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది.