మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్గా కథలను ఓకే చేస్తూ సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ఈయన సహ నటులు ఒకటి రెండు సినిమాలను లైన్లో పెడితే ఈయన మాత్రం నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా చిరు సీతారామం, బింబిసార చిత్రాలు ఘన విజయం సాధించడంతో మేకర్స్కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు.
చిరు ట్విట్టర్లో ‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్నిస్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండు విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ సంధర్భంగా సీతారామం, బింబిసార చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మన: పూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్లో తెలిపాడు.
చిరంజీవి ప్రస్తుతం మోహన్రాజా దర్శకత్వంలో గాడ్ఫాదర్ చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. దీనితో పాటుగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య(టైటిల్ ఇంకా పరిశీలనలో ఉంది) సినిమాను చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరు అండర్ కవర్ కోప్గా కనిపించనున్నాడు. ఇవే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నాడు. కీర్తిసురేష్ ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా నటిస్తుంది.
Hearty Congratulations
Team #SitaRamam &
Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022