Sankranti Celebrations | ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను టాలీవుడ్ మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంటోంది. పొంగల్కి మనుమరాలు క్లీంకారా(Klin Kaara)తో పాటు.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టడంతో ఈ సంక్రాంతిని గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒక్కొక్కరుగా బెంగళూరు ఫార్మ్ హౌస్కు చేరుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఈరోజు ఉదయం అల్లు అర్జున్, స్నేహారెడ్డి బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద అల్లు కపుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా హీరోలంతా ఫ్యామిలీతో భోగి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక వీడియోలను మీరు చూసేయండి.