Meera Chopra | బాలీవుడ్ నటి మీరా చోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన రక్షిత్ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో మీరా మంగళవారం ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో వీరి పెళ్లి జరుగగా మీరా చోప్రా తన వివాహ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇక ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా.. మీరాకు కజిన్లు. చోప్రా కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి ప్రియాంక చోప్రా రాలేదు.
పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మీరా చోప్రా. ఆ తర్వాత ‘వానస, మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా ప్రస్తుతం సఫేద్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.