Kriti Sanon |ప్రసిద్ధ బాలీవుడ్ నటి మీనా కుమారి జీవితం వెండితెరపై దృశ్యమానం కాబోతున్నది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ బయోపిక్ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. మీనా కుమారి పాత్రకు కృతిసనన్ను ఎంపిక చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనుల్లో మనీష్ మల్హోత్రా బిజీగా ఉన్నారని, ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్తుందని చెబుతున్నారు. బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్గా పేరు పొందిన మీనా కుమారి 33 ఏళ్ల కెరీర్లో దాదాపు తొంభై చిత్రాల్లో నటించింది. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. దేశం గర్వించే గొప్ప నటి పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నానని కృతిసనన్ పేర్కొంది.