Mathu Vadalara 2 | ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2). బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’(Mathu Vadalara)కు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైం కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘మత్తు వదలరా 2’ రేపు విడుదల కానుండగా.. ఫస్ట్ పార్ట్ని చూడని వారి కోసం ‘మత్తు వదలరా’ టీం ఒక స్పెషల్ వీడియోను వదిలింది. ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ మూవీ స్టోరీని శ్రీ సింహా, కమెడియన్ సత్య ఒక క్రైమ్ స్టోరీలాగా చెబుతుంటారు. ఫన్నీగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ఇక మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ చూడని వారు కూడా ఈ వీడియో చూస్తే.. ఈ సినిమా గురించి ఒక క్లారిటీ వస్తుంది.